ప్రియాంకా రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత : మంత్రి సత్యవతి రాథోడ్ కు నిరసన సెగ

ప్రియాంకా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి సత్యవతి రాథోడ్ కు నిరసన సెగ తగిలింది. దీంతో ప్రియాంకా రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

  • Publish Date - November 29, 2019 / 02:17 PM IST

ప్రియాంకా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి సత్యవతి రాథోడ్ కు నిరసన సెగ తగిలింది. దీంతో ప్రియాంకా రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

డాక్టర్ ప్రియాంకా రెడ్డిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంకా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి సత్యవతి రాథోడ్ కు నిరసన సెగ తగిలింది. సత్యవతి రాథోడ్ ను స్థానికులు అడ్డుకున్నారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే ఘోరం జరిగేదికాదంటూ నిరసన తెలిపారు. పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. దీంతో ప్రియాంకా రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో సంచలనం సృష్టించిన వెటర్నిటీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్య కేసును సైబరాబాద్‌ పోలీసులు చేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. అందరూ అనుమానించినట్టే… ప్రియాంక విషయంలో అత్యంత దారుణం జరిగినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. హత్యకు ముందు అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. చీకటి పడటం, ప్రియాంకరెడ్డి ఒంటరిగా ఉండటం, నిర్మానుష్య ప్రదేశం కావడంతో మానవ మృగాలు కిరాతకంగా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణ చేశారు.

నిందితులు ప్రియాంకరెడ్డి స్కూటీని పంక్చర్‌ చేసి డ్రామాలు ఆడారు. తామే పంక్చర్‌ వేయిస్తామని చెప్పి.. ఆమె మాటల్లో పెట్టి కిడ్నాప్‌ చేశారు. ఆ తర్వాత ఆమెను రేప్‌ చేసి చంపేశారు. చంపేసిన తర్వాత తమపై అనుమానం రాకుండా ఉండేందుకు.. ప్రియాంక శవాన్ని దూరంగా తీసుకెళ్లి తగులబెట్టారు. అయితే.. బాడీని తీసుకువెళ్లేటప్పుడు అందరికి అనుమానం కలుగుతుందని అనుమానం వచ్చిన లారీ డ్రైవర్లు.. దుప్పటి అడ్డంగా చుట్టారు. కల్వర్టు దగ్గరకు ప్రియాంకరెడ్డి డెడ్‌బాడీని తీసుకువెళ్లిన తర్వాత.. దుప్పటితో సహా కాల్చి చంపారు. ప్రియాంక మృతదేహాం 70 శాతం కాలిపోయింది. నిందితులు మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి వాసులుగా గుర్తించారు. నలుగురు కలిసి ఆమెపై అఘాయిత్యం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.