ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు ఇంటిలిజెన్స్ చెబుతున్న నేపథ్యంలో ఏపీలోని తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. దక్షిణాది రాష్ట్రాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్రం హెచ్చరించగా.. తిరుమలతోపాటు అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేయాలని పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు జనసమ్మర్థం ఉండే ప్రదేశాల్లో తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు.
తస్మాత్ జాగ్రత్త.. ఉగ్రదాడులు జరగొచ్చు: నిఘా నీడలో తిరుపతియాత్రికులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కానీ, వస్తువులు కానీ కనిపిస్తే డయల్ 100కు, పోలీస్ వాట్సప్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బాంబు, డాగ్ స్క్వాడ్లు రైల్వేస్టేషన్లు, బంస్టాండ్లు, అతిథి గృహాలు, దేవాలయాల్లో తనిఖీలు చేపట్టాయి. రేణిగుంట, శ్రీకాళహస్తి, తిరుమల ప్రాంతాలలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లగేజీని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాలు తీరిన తర్వాతే వదిలిపెడుతున్నారు. శ్రీలంకలో ఉగ్రదాడుల జరిగిన తర్వాత ఉగ్రవాదులు భారత్ను టార్గెట్ చేసినట్లుగా ఇంటిలిజెన్స్ చెబుతున్న సంగతి తెలిసిందే.