Viral Video: వాహనాలు నడుపుతున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎటో ఆలోచిస్తూ, మరేదో పనిచేస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలు కొనితెచ్చుకోవాల్సి ఉంటుందని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొందరు యువకులు అత్యుత్సాహం చూపిస్తుంటారు. ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
రహదారిపై ఎస్యూవీలో వెళ్తూ స్టీరింగ్ వదిలేసి పక్కకు తిరిగి ప్లే కార్డ్స్ ఆడాడు ఓ యువకుడు. ఆ ఎస్యూవీలో మరో ముగ్గురు యువకులు ఉన్నారు. వారిలో ఒకరు ఈ వీడియో తీశారు. కారు స్టీరింగ్ ను వదిలేసి ఎడమ పక్కకు తిరిగిన యువకుడు తాను ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు చిరునవ్వులు చిందిస్తూ ప్లే కార్డ్స్ ఆడాడు.
ఫర్షాన్ రాజ్ పుత్ అనే యువకుడు ఈ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. మహీంద్ర ఎస్యూవీ 700లో ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నాడు. ఈ ఎస్యూవీలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టన్స్ సిస్టమ్ ఫీచర్ ఉంటుంది. ఇది ఒక ఎలక్ట్రానిక్ సిస్టం.
అయినప్పటికీ, ఈ విధంగా ఎస్యూవీను నడపడం ఏంటని, ఆ వాహనంలోకి వారికే కాకుండా రోడ్డుపై ఇతర వాహనాకూ ప్రమాదం పొంచి ఉంటుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా కారు నడిపిన ఆ యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కామెంట్లు చేశారు.
Maharashtra: అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు.. మహారాష్ట్ర మంత్రిపై ఇంకు చల్లిన వ్యక్తి