దేశం మొత్తం ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంది. రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులంతా జాతీయ జెండాను ఆవిష్కరించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన పనికి తప్పుడు కారణాలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
దానికి కారణం.. జాతీయ జెండాను తిరగేసి ఎగరేయడమే. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ ఆఫీసులో జరిగింది ఈ ఘటన. జెండాను ఎగరేసి దానికి సెల్యూట్ చేశారు. ఆ తర్వాత జాతీయ గీతం పాడేంత వరకూ చూసుకోలేదు. పైన ఎండకు జెండా ఎగరేసినప్పటికీ తలెత్తి ఎవరూ చూడలేదు. ఈ పొరబాటు జరగడానికి అది కూడా ఓ కారణం కావచ్చు.
మొత్తానికి సిబ్బంది చేసిన తప్పుకు మంత్రి అవంతి శ్రీనివాస్ కు విమర్శలు తప్పలేదు. జాతీయ జెండా కోడ్ ఉల్లంఘించి ఇలా తలకిందులుగా వేలాడదీయడం కొత్తేం కాదు. వ్యక్తుల నిర్లక్ష్యం చాలాసార్లు ఈ పొరబాటు జరిగేలా చేసింది.
What to call an Indian who does not know the national flag ? Apparently Ycheaps Alla Nani and Avanthi Srinivas do not know . Green on top? ?? pic.twitter.com/Bw3ZN1dPrc
— Brinda (@B4Politics) November 28, 2019
@AskAnshul bhai see how ap ycp leaders insult our national flag..thisis 2nd time doing flag inagaration for minister avanthi srinivas pic.twitter.com/sR0msw8vuR
— Ravi Machha (@jayaravii) January 26, 2020