రేప్ నిందితుడు పక్కా ప్లాన్: అక్కను చంపేసి బాధిత కుటుంబంపై తోసేయాలని..

రేప్ నిందితుడు పక్కా ప్లాన్: అక్కను చంపేసి బాధిత కుటుంబంపై తోసేయాలని..

Murder

Rape Case Divertion: దళిత బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడైన వ్యక్తి మాస్టర్ ప్లాన్ వేశాడు. దాని కోసం సొంత అక్కనే చంపేశాడు. అమ్రోహా జిల్లాలో నమోదైన గ్యాంగ్ రేప్ కంప్లైంట్ సెటిల్ చేయాలని కుయుక్తులు పన్నాడు. కేసు సెటిల్ చేయడానికి ఢిల్లీ నుంచి అక్కను పిలిపించాడు. ఓ ఖాళీ స్థలం దగ్గర కారు ఆపి గొంతుకోశాడు. ఆ తర్వాత ఇటుకతో చాలా సార్లు కొట్టాడు.

రక్తపు మరకలు ఉన్న దుస్తులు పొదల్లో దాచేసి.. కాసేపటికి బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. శవాన్ని రికవరీ చేసుకున్న ఆమ్రోహ డెహాట్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

సోమవారం హిల్టన్ స్కూల్ వద్ద ఉన్న బైపాస్ రోడ్ లో శవం దొరికింది. రోడ్ మీద పడి ఉన్న ఐడీ కార్డు సహాయంతో తనని గుర్తించారు. ఆమె అంకుల్ పెట్టిన కేసు ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. క్రైమ్ స్పాట్ దగ్గర్లోని సీసీటీవీ ఫుటేజి పరిశీలించి చూసేసరికి అక్కాతమ్ముడు బైక్ మీద వెళ్లినట్లు గుర్తించారు. మంగళవారం సాయంత్రం నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

నేరాన్ని ఒప్పుకున్న అంకిత్.. కళ్యాణ్‌పూర్ బైపాస్ వద్ద పొదల మాటున ఉన్న రక్తపు మరకల దుస్తులను రికవరీ చేసుకున్నారు. తన సిస్టర్ ఢిల్లీలో నాలుగేళ్లుగా పనిచేస్తుందని రెగ్యూలర్ గా తనను కలిసేందుకు అక్కడికి వెళ్లి వస్తుండేవాడినని నిందితుడు చెప్పాడు.

జనవరి 18న దళిత బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత 22ఏళ్ల వ్యక్తి, అతని బంధువు ఇద్దరిపై బాధితురాలు స్టేట్ మెంట్ ప్రకారం.. కేసు ఫైల్ చేశారు. నిందితుడు తప్పించుకోవడానికి వేరే దారి లేక తన అక్కనే చంపి అది బాధితుల కుటుంబంపై రుద్దాలని ప్రయత్నించినట్లు అమ్రోహా పోలీసులు అంటుున్నారు.