భారత్ లో భోజనం చేసి మయన్మార్ లో నిద్ర..ఆ ఇల్లే ఓ ప్రత్యేకం

భారత్ లో భోజనం చేసి మయన్మార్ లో నిద్ర..ఆ ఇల్లే ఓ ప్రత్యేకం

man living at India-Mayanmar border Villege : భారత ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌‌. నాగాలాండ్‌‌కు ఉత్తర భాగంలో మన్ అనే ఓ జిల్లా. ఆ జిల్లాలో ఓ గ్రామం పేరు లోంగ్వా. ఆ గ్రామం వెరీ స్పెషల్. ఆ గ్రామంలో ఉండే ఓ ఇల్లు వెరీ వెరీ స్పెషల్. ముందుగా ఆ గ్రామం ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం. లోంగ్వా గ్రామం రెండు దేశాల్లో ఉంటుంది. భారత్-మయన్మార్ దేశాల సరిహద్దుల్లో ఉంటుంది లోంగ్వా గ్రామం. ఈ గ్రామం మధ్యలో నుంచి రెండు దేశాల సరిహద్దు రేఖ వెళుతుంది. సాధారణంగా ఇటువంటి గ్రామాల్లోని ప్రజలకు ఏదో ఒక దేశానికి చెందిన పౌరసత్వమే ఉంటుంది. కానీ లోంగ్వా గ్రామస్తులు ప్రత్యేకతే వేరు. ఇక్కడ నివసించే కొణ్యక్‌ తెగ గిరిజనులకు రెండు దేశాలూ తమ దేశ పౌరసత్వం (భారత్-మయన్మార్) కల్పించాయి.

ఈ గ్రామమే ఓ ప్రత్యేకత అంటే ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. ఈ గ్రామ పెద్ద లోక్‌నంగ్‌ ఇల్లు సరిగ్గా ఇరు దేశాల సరిహద్దు రేఖపై ఉంటుంది. ఈ ఇల్లు సగం భారత్ లోనూ..మరో సగం మయన్మార్‌లోనూ ఉంటుంది. అంటే గ్రామ పెద్దా..వారి కుటుంబం సభ్యులు..ప్రతీ రోజూ భారత్‌‌లో భోజనం చేసి మయన్మార్‌లో నిద్రపోతారi..!! భలే ఉంది కదూ ఈ లోంగ్వా గ్రామం..దాంట్లో ఉండే గ్రామ పెద్ద ఇల్లు..

అంతేకాదు లోంగ్వా గ్రామంలోని ప్రజలు..ముఖ్యంగా యువకులు వారి వారి వీలుకు తగినట్లుగా కొంతమంది భారత్‌లో వ్యాపారం చేస్తుంటే మరికొందరు ఏకంగా మయన్మార్ సైన్యంలోనే పనిచేస్తున్నారు. ఈ విషయం గురించి లోంగ్వా గ్రామస్తుల్ని అడిగితే వారు ఒకటే చెబుతారు. తమ దృష్టిలో భారత్‌- మయన్మార్‌ ఒక్కటేనంటారు. రెండు దేశాలకు మధ్య మాకు పెద్ద తేడా ఏమీ తెలీదని చెబుతారు.

వీరిని భారత్‌లోని అతి పురాతనమైన ‘హెడ్‌ హంటర్స్‌’ ఆదివాసీలుగా పేర్కొంటారు. తమకు శత్రువులుగా భావించే ఇతర గిరిజన తెగ ప్రజల తలలు నరికి తేవడం కొణ్యక్‌ తెగ సంప్రదాయంలో భాగంగా ఉండేదట గత కొంతకాలం క్రితం వరకూ. కానీ.. 1960 తర్వాత వీరు క్రమేపీ అంతరించిపోయారు. దీనికి కారణం ఆ ప్రాంతంలో క్రిష్టియానిటీ పెరగటమేనంటారు.

వేరే జాతికి చెందిన గిరిజనుల తలలు నరికి తెచ్చినవారిని హీరోల్లా చూసేవారట కొణ్యక్ తెగలవారు. అలా ఎవరు చేసినా ఏదో ఘనకార్యం అన్నట్లు గుర్తుగా ఆ వ్యక్తి ఒంటిమీద పచ్చబొట్టు వేయించి..కొణ్యక్ గిరిజన సంప్రదాయంలో సంబరాలు జరుపుకునేవారట. కానీ కాలంతో పాము లోంగ్వా గ్రామస్తులు..ఆ ప్రాంతంలో నివసించే ఇతర గిరజనులు కూడా మారారు.

ఇప్పుడు అటువంటి ఛాయలు కూడా అక్కడ లేవు. కానీ ఆ ప్రాంతంలోని వృద్ధులు గతంలో జరిగినవి చెబుతుంటే నిజమా అంటూ వింటారట నేటి తరం వారు. అక్కడి వృద్ధుల ఒంటిమీద కనిపించే పచ్చబొట్లు వాళ్లు ‘హెడ్‌ హంటర్స్‌’ అని ఇప్పటికీ గుర్తు చేస్తుంటాయట. భారత్‌, మయన్మార్‌ దేశాల్లోని గ్రామాల్లో కలిపి దాదాపు 20లక్షల మంది కొణ్యక్‌ గిరిజనులు నివసిస్తున్నారు. ఇప్పుడు వారు చిన్న చిన్న ఉపాధులతో జీవిస్తున్నారు. ఎవరికి తోచిన వ్యాపారాలు..ఉపాధులతో జీవిస్తున్నారు. ఇటు భారత్ అన్నా అటు మయన్మార్ అన్నా వారికి చాలా ఇష్టం..ఈ రెండు దేశాలు మావేనంటారు…