లిక్కర్ మాఫియా కాల్పుల్లో ఎస్సై మృతి
police sub inspector :బీహార్లో ఇవాళ ఓ సబ్ ఇన్స్పెక్టర్ను కాల్చి చంపారు. సీతామఢి జిల్లా మజోర్గంజ్లో ఈ ఘటన జరిగింది. అక్రమ మద్యం అమ్మకాల కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు అతని ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులు ఇంట్లోకి ప్రవేశిస్తున్న సమయంలో వారిపై కాల్పులు జరిపారు.
లిక్కర్ మాఫియాకు పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో సబ్ ఇన్స్పెక్టర్ దినేశ్ రామ్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే హాస్పిటల్కు తీసుకువెళ్తున్న సమయంలో సబ్ ఇన్స్పెక్టర్ మృతిచెందినట్లు డీఎస్పీ పీఎన్ సాహూ తెలిపారు. ఓ వాచ్మెన్కు కూడా తీవ్రగాయాలయ్యాయని…ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ కాల్పుల్లో ఓ స్మగ్లర్ సైతం మరణించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.