లిక్కర్ మాఫియా కాల్పుల్లో ఎస్సై మృతి

లిక్కర్ మాఫియా కాల్పుల్లో ఎస్సై మృతి

police sub inspector :బీహార్‌లో ఇవాళ ఓ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ను కాల్చి చంపారు. సీతామఢి జిల్లా మజోర్​గంజ్​లో ఈ ఘటన జరిగింది. అక్ర‌మ మ‌ద్యం అమ్మ‌కాల కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు అత‌ని ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులు ఇంట్లోకి ప్ర‌వేశిస్తున్న స‌మ‌యంలో వారిపై కాల్పులు జ‌రిపారు.

లిక్కర్ మాఫియాకు పోలీసులకు మధ్య జరిగిన ఎన్​కౌంటర్​లో సబ్ ఇన్​స్పెక్టర్ దినేశ్ రామ్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్తున్న స‌మ‌యంలో స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్ మృతిచెందిన‌ట్లు డీఎస్‌పీ పీఎన్ సాహూ తెలిపారు. ఓ వాచ్​మెన్​కు కూడా తీవ్రగాయాలయ్యాయని…ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ కాల్పుల్లో ఓ స్మగ్లర్ సైతం మరణించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.