మోహన్లాల్ 60వ బర్త్ డే స్పెషల్: దృశ్యం-2 అనౌన్స్మెంట్
మోహన్లాల్ 60వ బర్త్ డేను కేరళ నుంచి జరుపుకుంటున్నారు. ఈ స్పెషల్ డే సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమా దృశ్యం సీక్వెల్ తీయనున్నట్లు ప్రకటించారు. 2013లో రిలీజ్ అయిన తొలి పార్ట్ సూపర్ హిట్ అయింది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50కోట్లకు పైగా వసూలు చేసిన తొలి సినిమాగా ఘనత సాధించింది.
ఈ సందర్భంగా సీక్వెల్ అనౌన్స్మెంట్తో పాటు 20 సెకన్ల టీజర్ కూడా విడుదల చేశారు. జార్జ్ కుట్టీ క్యారెక్టర్ లో ఉన్న మోహన్లాల్ స్లోగా కళ్లు తెరుస్తారు ఇదే టీజర్. ఆంటోనీ పెరుంబవూర్ దీనికి నిర్మాణ బాధ్యతలు వహించనున్నారు. ఈ టీజర్ రిలీజ్ చేస్తూ.. #Drishyam #Drishyam 2 (sic).” అంటూ హ్యాష్ ట్యాగ్లు పెట్టారు.
సినిమా ఫస్ట్ పార్ట్ లో మోహన్ లాల్ క్యారెక్టర్ జార్జి కుట్టీ జీవితాన్నే ఇందులోనూ కొనసాగించనున్నారు. సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా తన కూతురు చేసిన మర్డర్ ను తెలివిగా తప్పిస్తాడు. అతను తప్ప వేరెవ్వరికీ తెలియకుండా ఆ శవం మాయం చేస్తాడు.
ఇక దృశ్యం-2సినిమా షూటింగ్ ను కేరళ ప్రభుత్వం సినిమా షూటింగ్ కు ఓకే చెప్పినప్పుడు ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు.. మిగిలిన నటీనటులను గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని వెల్లడించారు. మోహన్ లాల్, డైరక్టర్ జీతూ జోసెఫ్ ల కాంబినేషన్ లో రామ్ అనే మళయాళ సినిమా వచ్చింది.
#Drishyam #Drishyam2 pic.twitter.com/OHnue7P5uw
— Mohanlal (@Mohanlal) May 21, 2020
ముందుగానే మొదలుపెట్టాలనుకున్న సినిమా షూటింగ్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదాపడింది.
Read: Covid test kits కోసం Filmfare trophyల వేలం పెట్టిన బాలీవుడ్