సందీప్ రెడ్డి వంగ సెకండ్ బాలీవుడ్ మూవీ

కబీర్ సింగ్ నిర్మాతలు భూషణ్ కుమార్ – మూరధ్ ఖేతని సందీప్ రెడ్డి వంగతో హిందీలో క్రైమ్ డ్రామా ఫిలిం చెయ్యనున్నారు..

  • Published By: sekhar ,Published On : October 10, 2019 / 06:05 AM IST
సందీప్ రెడ్డి వంగ సెకండ్ బాలీవుడ్ మూవీ

కబీర్ సింగ్ నిర్మాతలు భూషణ్ కుమార్ – మూరధ్ ఖేతని సందీప్ రెడ్డి వంగతో హిందీలో క్రైమ్ డ్రామా ఫిలిం చెయ్యనున్నారు..

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన యువ దర్శకుడు సందీప్ వంగ బాలీవుడ్‌లో కూడా అదే ఫార్ములతో సక్సెస్ అందుకున్నాడు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్.. కబీర్ సింగ్ ఊహించని విధంగా రూ. మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి నిర్మాతలకు మంచి లాభాల్ని అందించింది. దీంతో మళ్ళీ ఆ నిర్మాతలు సందీప్‌తో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.

గత కొంత కాలంగా ఈ విషయంపై పలు రకాల కథనాలు వస్తున్నప్పటికి చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. ఫైనల్‌గా ఇటీవల కబీర్ సింగ్ నిర్మాతలు భూషణ్ కుమార్ – మూరధ్ ఖేతని సందీప్ వంగని కలుసుకోవడంతో క్లారిటీ వచ్చింది. ఇక ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. క్రైమ్ డ్రామా తరహాలో సందీప్ తన తదుపరి ప్రాజెక్ట్‌ని డెవలప్ చేసుకున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. త్వరలో టైటిల్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు సినిమాలో తెలియజేయనున్నారు.

Read Also : సైరా సక్సెస్ పార్టీలో బాలయ్య సందడి!

సందీప్ దర్శకత్వం వహించడమే కాక.. కో-ప్రొడ్యూసర్‌గానూ నిర్మాణంలో భాగం కానున్నాడు. కబీర్ సింగ్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకు 2019లో రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న టాప్ సినిమాగా కబీర్ సింగ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మరి నెక్స్ట్ సినిమాతో దర్శకుడు సందీప్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.