గోదావరి నదిలో పాపికొండల విహార యాత్రకు రంగం సిద్ధమైంది. 2021, నవంబర్ 07వ తేదీ ఆదివారం నుంచి యాత్ర ప్రారంభం కానుంది.
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటం, ఎంతో కాలంగా పాపికొండలు పర్యాటకాన్నే జీవనం సాగిస్తున్న వారికి తిరిగి ఉపాధి చూపేందుకు పర్యాటకులను తిరిగి అనుమతించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.