Home » Kharif Kandi
కందిపంటను సాగుచేసే రైతులు భూసారాన్ని అనుసరించి, సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది. అంతే కాదు తొలిదశలో వచ్చే తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవాలంటే తప్పకుండా విత్తనశుద్ధి చేయాల్సి ఉంటుంది.
కూరగాయల్లో టమాటకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మిగతా అన్ని పప్పు దినుసుల కంటే, కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేదు.
తెలుగు రాష్ట్రాల్లో కంది పంటను సుమారు 12 లక్షల ఎకరాలకు పైగా సాగుచేస్తున్నారు. ప్రధానంగా ఖరీఫ్ పంటగా దీన్ని వర్షాధారంగా సాగుచేస్తారు. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో గత ఏడాది సుమారుగా 8 లక్షల ఎకరాల్లో సాగైంది. కందిని ఏకపంటగానే కాక పలు పంటల్లో అంత�