ఎల్పీజీ సిలీండర్ల కొత్త ధరలు సోమవారం విడుదలయ్యాయి. నూతన ధరల ప్రకారం.. వాణిజ్య సిలీండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్ పీజీ సిలీండర్ పై రూ. 36 తగ్గిస్తూ చమురు సంస్థలు తెలిపాయి.
నిరుద్యోగం పెరిగిపోయిన సమయంలో ప్రజలు తమ ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్ను ఎక్కువ ఖరీదు పెట్టి కొనేలా చేస్తున్నారు. కొత్త సిలిండర్ కనెక్షన్ ధర రూ.1,450 నుంచి రూ.2,200కు పెంచారు. సెక్యూరిటీ డిపాజిట్ ధర రూ.2,900 నుంచి రూ.4,400కు పెంచారు.
దేశవ్యాప్తంగా వంటగ్యాస్, పెట్రోల్ - డీజిల్, వంట నూనె ధరలు పెరిగిపోతుండగా సామాన్యులకు పెను భారంగా మారింది. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన ధరలు.. మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయట.
https://youtu.be/FfAJq903ATo