Paddy Cultivation : వరిలో కాండంతొలుచు పురుగు, సుడిదోమ ఉధృతి… నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు
పిలక దశలో ఉన్న వరిలో వాతావరణ మార్పులు కారణంగా తెగుళ్లు వ్యాప్తించాయి. ప్రస్తుతం కాండం తొలుచుపురుగు ఆశించగా, ఈనిక దశలో సుడిదోమ సోకే ప్రమాదం ఉంది. అయితే వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.
- Guntupalli Ramakrishna
- Published On : March 10, 2023 / 09:20 AM IST
Paddy
Paddy Cultivation : ఆహార ధాన్యాల్లో అధికంగా పండిండే పంట వరి. ప్రస్తుతం..వాతావరణ మార్పులు కారణంగా, పిలక దశలో ఉన్న వరిలో కాండం తొలుచు పురుగు, సుడిదోమ ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఇప్పటికే వరిలో అగ్గి తెగులు ఆశించిన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో నివారించకపోతే దిగుబడి దెబ్బతిని, రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. మరోవైపు వరిలో నీటి నిల్వ అధికంగా ఉండడం, నత్రజని అధిక మోతాదులో వాడటం వల్ల సుడిదోమ సోకే ప్రమాదం ఉంది.
READ ALSO : Prevention Of Pests : వరిలో చీడపీడల నివారణ, రైతులకు శాస్త్రవేత్తల సూచనలు !
పిలక దశలో ఉన్న వరిలో వాతావరణ మార్పులు కారణంగా తెగుళ్లు వ్యాప్తించాయి. ప్రస్తుతం కాండం తొలుచుపురుగు ఆశించగా, ఈనిక దశలో సుడిదోమ సోకే ప్రమాదం ఉంది. అయితే వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు, రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తేలియజేస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. పూర్తి వివరాలకు కోసం క్రింద వీడియోపై క్లిక్ చేయండి.
