Pests and Diseases in Groundnut
Groundnut : నూనెగింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశనగ. ప్రస్థుతం 20 నుండి 50 రోజుల దశలో పంట ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చీడపీడల బెడద అధికమవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రసం పీల్చు పురుగులు, లద్దెపురుగుల తాకిడి అధికంగా వున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి శాస్త్రవేత్త డా. జి. చిట్టిబాబు ద్వారా తెలుసుకుందాం.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశనగను వర్షాధారంగా విస్తారంగా సాగుచేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. చాలా ప్రాంతాల్లో పంట పూత దశకు చేరుకుని ఊడలు దిగుతున్నాయి. కొన్నిప్రాంతాల్లో వేరుశనగ గింజ కట్టే దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా మారింది.
ప్రధానంగా రసంపీల్చు పురుగుల వల్ల చాలా ప్రాంతాల్లో పంట ఎదుగుదల లేక గిడసబారినట్లు కనిపిస్తోంది. వెంటనే వీటి నివారణకు సమగ్రసస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డా. జి. చిట్టిబాబు. వేరుశనగకు పురుగుల వల్ల కలిగే నష్టం తీవ్రంగా వుంటుంది. ఆకుముడత, పొగాకు లద్దె పురుగుల ఉధృతి పెరిగితే…దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వీటి నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా వుండాలంటారు శాస్త్రవేత్త.
Read Also : Agri Tips : ఖరీఫ్కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు