14 killed in road mishap in Kurnool : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండంల మాదాపురం దగ్గర లారీ, టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.