corona new cases in AP : ఏపీలో గత 24 గంటల్లో కరోనా వైరస్ కేసులు రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 140 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
ఏపీలో ఇవాళ 24,311 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. నేటివరకు 1,35,89,373 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు 8,88,959 మంది కరోనా వైరస్ బారినపడ్డారు.
రాష్ట్రంలో 8,81,181 మంది సంపూర్ణంగా కోలుకున్నారు. మరో 615 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వైరస్ ప్రభావంతో నేటివరకు 7,163 మంది మృతి చెందారు.