Ap Covid Cases Update
AP Covid-19 Update : ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. మొన్న 117 కోవిడ్ కేసులు నమోదు కాగా …నిన్న 191 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నిన్న కోవిడ్ నుంచి 416 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్ళారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 2 వేల 734 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 70వేల 286 కి చేరింది. వీరిలో 20 లక్షల 53 వేల 134 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
Also Read :Call Money : కర్నూలులో కాల్మనీ కలకలం-మహిళపై దాడి
ఏపీలో గత 24 గంటల్లో కృష్ణాలో ఒకరు ,ప్రకాశం జిల్లాల్లో ఒకరు కోవిడ్ వల్ల మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14 వేల 418 కు చేరింది. నిన్నటివరకు రాష్ట్రంలో 3 కోట్ల 31 వేల 083 మంది శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.