ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు భారీగా విరాళాలు అందజేసిన మరింత మంది

విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును కలిసి ఆదివారం పెద్ద ఎత్తున విరాళాలు అందించారు.

ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి పలువురు విరాళాలు అందజేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.

పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, చలన చిత్ర ప్రముఖులు, విద్యారంగ ప్రముఖులు, ప్రవాస భారతీయులు పెద్దఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విరాళాలు అందజేస్తున్నారు. ఆపన్న హస్తం అందించేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్న దాతలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును కలిసి ఆదివారం పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్న దాతలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు?
1. ఏపీ పోలీస్ అధికారుల సంఘం రూ.11 కోట్ల 12 లక్షల 50 వేలు
2. దీపక్ నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవీ సుబ్రహ్మణ్యం రూ.1 కోటి
3. వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ.50 లక్షలు
4. వై.రాజారావు రూ.10 లక్షలు
5. కె.సాంబశివరావు రూ.5 లక్షలు
6. సీహెచ్.పూర్ణ బ్రహ్మయ్య రూ.5 లక్షలు
7. డాక్టర్ శరత్ బాబు రూ.5 లక్షలు
8. సి.టీ.చౌదరి రూ.2 లక్షల 55 వేలు
9. శ్రీ కోవిల్ ఫ్లాట్స్ ఒనర్స్ రెసిడెంట్ అసోసియేషన్ రూ.2 లక్షల 21 వేల 116
10. వెలగపూడి సత్యనారాయణ రూ.2 లక్షల 116 లు
11. ఎమ్.శ్రీనివాసరావు రూ.2 లక్షలు
12. పువ్వాడ రామకృష్ణ రూ.2 లక్షలు
13. సీహెచ్.శివరామ్ కృష్ణ రూ.1 లక్షా 32 వేలు
14. బి.నవీన్ బాబు రూ.1 లక్షా 116లు
15. జాస్తి శైలజారాణి రూ.1 లక్ష
16. జె.శాంభవి రూ.1 లక్ష
17. జె.శశాంక్ చౌదరి రూ.1 లక్ష

Also Read: అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీదే- జర్నలిస్టులతో సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు