Ap Corona Cases
AP Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 141 కేసులు నమోదవగా, తాజాగా 162 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో 31వేల 743 శాంపిల్స్ పరీక్షించారు. కాగా, గత 24 గంటల్లో కోవిడ్ తో ఎవరూ చనిపోలేదు. ఇది ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 186 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జిల్లాల వారీగా చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 30 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక కేసులు వెలుగుచూసింది.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,76,849. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 20,61,308. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14వేల 492. రాష్ట్రంలో ప్రస్తుతం 1049 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏపీలోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 10 ఒమిక్రాన్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురు కువైట్, సౌదీ అరేబియా, అమెరికా, నైజీరియా నుంచి వచ్చినట్టు గుర్తించారు. వారిని కలిసిన మరో ముగ్గురికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది.
Scientists Warning: అంతరిక్షంలోకి మనుషులు వెళితే చంపుకుతినడం ఖాయం: శాస్త్రవేత్తలు
కాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ కలవరం రేపుతోంది. క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.
ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. దాదాపుగా చాలామంది రెండు డోసులు తీసుకున్నారు. ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో ఇప్పుడు బూస్టర్ డోసు ఇచ్చేందుకు కేంద్రం సన్నద్ధమైంది. మానవాళికి ముప్పుగా మారిన కరోనావైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే అని నిపుణులు తేల్చి చెప్పారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలంది.
iPhones SIM slot : 2022లో సిమ్ కార్డు స్లాట్ లేకుండానే ఐఫోన్ మోడల్స్.. కాల్స్ చేసుకునేదెలా?
రానున్న పండుగల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, పండుగల వేళ ఒమిక్రాన్ కట్టడికి రాత్రి కర్ఫ్యూలు అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. భారీ సభలు, సమూహాలు నియంత్రించాలని స్పష్టం చేసింది. బాధితుల శాంపిల్స్ ను ఆలస్యం చేయకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని సూచించింది. డెల్టా, ఒమిక్రాన్ కేసులపై తరచుగా పరిశీలన జరపాలని, పాజిటివిటీ, డబ్లింగ్ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలంది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు నానాటికీ పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించాయి. అంతేకాదు కర్ఫ్యూ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని ఆంక్షలు పెట్టాయి. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు, హోటళ్లు, జిమ్లకు అనుమతిచ్చాయి. ఇండోర్ వేడుకల్లో 100 మందికి, బహిరంగ వేడుకల్లో 250 మందికే అనుమతి ఇచ్చాయి.
#COVIDUpdates: 29/12/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,73,954 పాజిటివ్ కేసు లకు గాను
*20,58,413 మంది డిశ్చార్జ్ కాగా
*14,492 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,049#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/55hrEiK442— ArogyaAndhra (@ArogyaAndhra) December 29, 2021