Bhogapuram Airport : భోగాపురం విమానాశ్రయంలో ట్రయల్ రన్ సక్సెస్.. తొలి విమానం దిగింది.. వీడియో వైరల్
Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురంకు తొలి విమానం చేరుకుంది.
- Harishth Thanniru
- Published On : January 4, 2026 / 11:43 AM IST
Bhogapuram Airport
Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురంకు తొలి విమానం చేరుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు దిగారు. వారికి స్థానిక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ 26న విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు జీఎంఆర్ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది.
