Ap Tobacco Farmers: ఏపీ పొగాకు రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఒక్కొక్కరికి రూ.50 వేల రుణం.. అస్సలు మిస్ అవకండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతులకు(Ap Tobacco Farmers) ఊరటనిచ్చే తీపి కబురు అందించింది కేంద్ర ప్రభుత్వం.
- V Santhosh Kumar
- Published on- August 2, 2026 / 12:41 PM IST
central government planning 50 thousand interest free loan to ap tobacco farmers
- పొగాకు రైతులకు వడ్డీలేని రుణం
- రూ.50వేల ఆర్థిక సహాయం విడుదల
- 40వేల మందికి చెకూరనున్న లబ్ధి
Ap Tobacco Farmers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతులకు ఊరటనిచ్చే తీపి కబురు అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల సంభవించిన వాతావరణ మార్పులు, తుపాన్లు, ఇతర కారణాల వల్ల తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి, వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు రూ.50,000 వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ (వడ్డీ లేని) రుణ సదుపాయాన్ని కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఏపీలోని పొగాకు సాగుదారులలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
సులభ వాయిదాలలో తిరిగి చెల్లించే వెసులుబాటు:
ఈ ప్రత్యేక రుణ సహాయానికి సంబంధించిన వివరాలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ లోన్ను రైతులు అత్యంత సులభంగా తిరిగి చెల్లించేలా రెండేళ్ల వ్యవధిని కేటాయించినట్లు తెలిపారు. అందులో భాగంగా, మొదటి సంవత్సరంలో తీసుకున్న రుణంలో సగం మొత్తాన్ని (రూ.25,000), మిగిలిన సగం మొత్తాన్ని రెండో సంవత్సరంలో చెల్లించవచ్చని స్పష్టం చేశారు. వడ్డీ ఏమీ లేకపోవడం వల్ల రైతులకు ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదని ప్రభుత్వం తెలిపింది.
40 వేల మంది రైతులకు లబ్ధి.. అందరికీ వర్తింపు:
రాష్ట్రంలోని పొగాకు(Ap Tobacco Farmers) సాగు చేసే ప్రతి ఒక్క రైతుకు ఈ ఉచిత వడ్డీ రుణం వర్తిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఎలాంటి పక్షపాతం లేకుండా అర్హులైన రైతులందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఈ చొరవ వల్ల ఆంధ్రప్రదేశ్వ్యాప్తంగా సుమారు 40,000 మంది పొగాకు రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సాగును మరింత విస్తరించుకోవాలని సూచించారు.
