Chandrababu Special Focus on Adjustment of Seats
TDP- Chandrababu : వైసీపీ ఇన్చార్జ్ల మార్పులు చేర్పుల జాబితాలను వరుసగా ప్రకటించడంతో లోక్సభ, అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై తెలుగు దేశం పార్టీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఖరారు పై టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న హైదరాబాద్లో తీవ్ర కసరత్తు చేశారు. మరోవైపు చంద్రబాబును కలిసేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు జనసేన ఆశిస్తున్న సీట్లపై పీటముడి వీడడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్లపై చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఎంపీ టికెట్ల విషయంలో మాత్రం టీడీపీ కసరత్తు చివరి దశకు వచ్చేసింది. వైసీపీ ఎమ్మెల్యేల చేరికలు ఉండడంతో పార్టీ హైకమాండ్ ఆచితూచి నిర్ణయాలు తీసుకోనుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ల వచ్చే విషయంలో పాత లీడర్లు, క్యాడర్ల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటామని అధిష్టానం చెబుతోంది.
Also Read: జగన్ సిద్ధం సభకు రానన్న వసంత కృష్ణ ప్రసాద్.. సీన్లోకి కేశినేని నాని
జనసేనకు ఎన్ని సీట్ల ఇవ్వాలి, బలమైన నాయకులు ఎవరు ఉన్నారు అన్న విషయాలపై చంద్రబాబు ఇప్పటికే నాయకులతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.