ఏపీకి నిధులు మంజూరు చేయండి- కేంద్రానికి సీఎం చంద్రబాబు విన్నపం

వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థిక సాయంగా నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు.

Cm Chandrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్ట్ నిధుల మంజూరుపై ప్రధానితో మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇటీవలే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిధుల విడుదలపైన చంద్రబాబు వాకబు చేశారు.

అంతేకాకుండా వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థిక సాయంగా నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు సమావేశం అయ్యారు. నిర్మలా సీతారామన్ తో భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు చంద్రబాబు.

Also Read : ఏపీలో వరుస కేసులు.. ఒకరి తర్వాత ఒకరు.. నెక్ట్స్‌ లిస్ట్‌లో వచ్చే పేరు ఎవరిదో?

ట్రెండింగ్ వార్తలు