రాజధాని @ విశాఖ : అనుకున్నది చేసిన సీఎం జగన్

అనుకున్నది సీఎం జగన్ సాధించారు. అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతోంది. మూడు రాజధానులపై ముందడుగు పడింది. పరిపాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి.

  • Publish Date - January 20, 2020 / 06:20 AM IST

అనుకున్నది సీఎం జగన్ సాధించారు. అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతోంది. మూడు రాజధానులపై ముందడుగు పడింది. పరిపాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి.

అనుకున్నది సీఎం జగన్ సాధించారు. అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతోంది. మూడు రాజధానులపై ముందడుగు పడింది. పరిపాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 11.15నిమిషాలకు అసెంబ్లీ ప్రారంభమైంది. వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి, సీఆర్డీఏ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేపె పెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లుని సభలో ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ముందుగా వికేంద్రీకరణ బిల్లుపై మంత్రి బుగ్గన చర్చ స్టార్ట్ చేశారు. మూడు రాజధానుల అంశాన్ని వికేంద్రీకరణ బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. లెజిస్లేటివ్ కేపిటల్ గా అమరావతి, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ, జ్యుడీషియల్ కేపిటల్ గా కర్నూలు ఉంటాయని ప్రకటించారు. సచివాలయం, రాజ్ భవన్, హెచ్ ఓడీ ఆఫీసులు విశాఖలోనే ఉంటాయని మంత్రి చెప్పారు. 

వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వం ఉద్దేశ్యం అని మంత్రి బుగ్గన చెప్పారు. సమాన అభివృద్ధి లేకపోవడం వల్లే ప్రాంతీయ అసమానాలు తలెత్తాయన్నారు. ప్రజలు రాజభవనాలు కోరుకోవడం లేదన్న మంత్రి బుగ్గన.. ప్రజలకు కావాల్సింది భద్రత, వసతులు అని చెప్పారు. 

మంత్రి బుగ్గన కామెంట్స్:
* మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం ముందడుగు
* సభ ముందకు రాష్ట్ర సమగ్రాభివృద్ధి, వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు
* పరిపాలన వికేంద్రీకరణపై అసెంబ్లీలో చర్చ
* వికేంద్రీకరణ బిల్లు చరిత్రాత్మకం
* సమ్మిలిత అభివృద్ధి మనందరి బాధ్యత
* జోన్లను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు డెవలప్ మెంట్ బోర్డులు ఏర్పాటు

* అభివృద్ది నత్తనడకన కాకుండా వేగంగా పరిగెత్తేలా చూసే బాధ్యత కూడా బోర్డులదే
* చట్ట సభలకు(లెజిస్లేటివ్ కేపిటల్) రాజధాని అమరావతి
* పరిపాలన రాజధానిగా(ఎగ్జిక్యూటివ్ కేపిటల్) విశాఖ
* కార్యనిర్వాహక వ్యవస్థ అంతా విశాఖలోనే ఉంటుంది
* న్యాయ రాజధానిగా(జ్యుడీషియల్ కేపిటల్) కర్నూలు అర్బన్ డెవలప్ మెంట్ ఏరియా
* మూడు రాజధానుల ప్రతిపాదనను వికేంద్రీకరణ బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం
* విశాఖలోనే రాజ్ భవన్, సచివాలయం, హెచ్ ఓడీ ఆఫీసులు

* హైకోర్టుకు సంబంధించిన విభాగాలన్నీ కర్నూలులోనే
* స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం
* పెద్ద నగరాల అభివృద్ధి వలస పాలనలోనే జరిగింది.. ఈ మధ్య కాలంలో జరగలేదు
* రాజభవనాలు కావాలని ప్రజలెవరూ కోరుకోవడం లేదు
* తమ అవసరాలు తీర్చే పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
* పన్నుల ఆదాయాన్ని బట్టే పరిపాలన ఉంటుంది
* అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్
* 3,4 జిల్లాలకు కలిపి ఓ జోనల్ డెవలప్ మెంట్ బోర్డు

* వెనుకబడిన ప్రాంతాల వారు సమాన అవకాశాలు కోరుతున్నారు
* వికేంద్రీకరణ ద్వారా సమగ్రాభివృద్ది జరగాలన్నదే ఉద్దేశ్యం
* ప్రజలకు కావాల్సింది వసతులు, భద్రత
* సమాన అభివృద్ధి లేకపోవడం వల్లే ప్రాంతీయ అసమానతలు 

ట్రెండింగ్ వార్తలు