Ap High Court: మెగా డీఎస్సీపై బిగ్ అప్డేట్.. సీబీఐ విచారణకు హైకోర్టు నో.. వైకాపా ఎమ్మెల్సీ పిటిషన్ కొట్టివేత
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై దాఖలైన సీబీఐ విచారణ పిటిషన్పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం(Ap High Court) కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
Ap high court rejects ycp mlc cbi probe petition on mega dsc
- మెగా డీఎస్సీపై హైకోర్టు తీర్పు
- సీబీఐ విచారణ పిటిషన్ కొట్టివేత
- రాజకీయ లబ్ధి పిటిషన్పై ఆగ్రహం
Ap High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై దాఖలైన సీబీఐ విచారణ పిటిషన్పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (Ap High Court)కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ నియామక ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా ఉందో లేక రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతోందో స్పష్టం చేయాలని కోర్టు అభిప్రాయపడింది. ప్రతిష్టాత్మక ఉపాధ్యాయ నియామకాలపై దాఖలైన ఈ పిటిషన్ను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, సీబీఐ విచారణ అవసరం లేదని స్పష్టం చేస్తూ అభ్యర్థనను తోసిపుచ్చింది.
Devarapalli Pattabhi Arrest: రూ.1000 కోట్ల సైబర్ స్కామ్.. తెలంగాణలో దొరికిపోయాడు.. ఇలా..
బాధితులు నేరుగా ఎందుకు రాలేదు?
వైకాపా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి దాఖలు చేసిన పిల్పై విచారణ సందర్భంగా, స్పోర్ట్స్ కోటా నిర్ణయాల వల్ల నష్టపోయినట్లు చెబుతున్న అభ్యర్థులు నేరుగా న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించలేదని హైకోర్టు ప్రశ్నించింది. అభ్యర్థులు కోర్టుకు రావడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను కోర్టు తోసిపుచ్చింది. బాధిత అభ్యర్థులు తమ సమస్యలను చట్టబద్ధంగా చెప్పుకునేందుకు రాజ్యాంగపరమైన హక్కులు స్పష్టంగా ఉన్నాయని, అభ్యర్థుల పేరుతో ఇతర వ్యక్తులు పిటిషన్లు వేయడం సముచితం కాదని పేర్కొంది.
రాజకీయ లబ్ధి కోసం పిల్ దుర్వినియోగం తగదు:
ప్రజాప్రయోజన వ్యాజ్యం ప్రజా శ్రేయస్సు కోసం ఉద్దేశించినదని, రాజకీయ ప్రయోజనాల కోసం లేదా పార్టీల ప్రాబల్యం కోసం దీనిని ఉపయోగిస్తే పిల్ ప్రాథమిక ఉద్దేశమే దెబ్బతింటుందని ఉన్నత న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది. నియామకాల ప్రక్రియలో న్యాయమైన అభ్యంతరాలు ఉన్నవారు చట్టబద్ధమైన మార్గాల ద్వారా రావచ్చునని తెలిపింది. రాజకీయ ప్రయోజనాలు ఆశించి దాఖలు చేసే ఇటువంటి పిటిషన్లను ప్రోత్సహించలేమని స్పష్టం చేస్తూ, సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.
