పవన్‌ కళ్యాణ్ అభిమానికి సీఎం జగన్‌ రూ.10 లక్షల ఆర్థిక సాయం

  • Publish Date - August 16, 2020 / 08:54 PM IST

పవన్‌ కళ్యాణ్ అభిమానికి సీఎం జగన్‌ రూ.10 లక్షలు మంజూరు చేశారు. పవన్ కళ్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, అతనికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ విషయాన్ని విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.



వెంటనే సీఎం జగన్ పవన్ కళ్యాణ్ అభిమానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్‌ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్‌వోసీ అందజేశారు. ప్రభుత్వ సాయంతో పవన్ అభిమాని నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి జరిగింది. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని సీఎంవో అధికారులు తెలిపారు.


ట్రెండింగ్ వార్తలు