AP CM YS Jagan: మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలి.. సీఎం జగన్ ట్వీట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ జెండాను ఎగురవేసి నేతలు, కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటున్నారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఏపీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
- Harishth Thanniru
- Published On : March 12, 2023 / 03:11 PM IST
YS Jagan
AP CM YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ జెండాను ఎగురవేసి నేతలు, కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు పార్టీ ఆవిర్భావం సందర్భంగా కేక్లు కట్ చేస్తూ, సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. వైసీపీ కార్యాలయంలో పార్టీ జెండాలు ఎగువేసి సంబురాలు చేసుకున్నారు.
YS Jagan: ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం చేస్తున్నాం
వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఏపీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘ 12 వసంతాలు పూర్తిచేసుకొని నేడు 13వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. గత 12ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతిఒక్కరికీ, మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
