Coromandel Huge Donation : కరోనా కట్టడిలో భాగంగా ఏపీ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందుతున్నాయి.. గతకొద్దిరోజులుగా కార్పొరేట్ సంస్థలు కోవిడ్ నివారణకు తమవంతు సహాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తున్నారు. తాజాగా ప్రముఖ ఫెర్టిలైజర్స్.. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.2 కోట్ల విరాళం అందజేసింది. ఇందుకు సంబంధించిన చెక్కును ఆ సంస్థ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ గోయెల్, వైస్ ప్రెసిడెంట్(కార్పొరేట్ రిలేషన్స్) కె.సత్యనారాయణ బుధవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ని కలిసి ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఆక్సిజన్ సిలిండర్లు, రోగుల అవసరాలకు వినియోగించాలని సీఎంను కోరినట్టు తెలుస్తోంది. కాగా ఆ సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కూడా ఉన్నారు.