వాణినే డోర్లు బద్దలు కొట్టారు.. ఆవిడ వల్లనే మాకు హాని పొంచి ఉంది: దివ్వెల మాధురి

వాణినే డోర్లు బద్దలు కొట్టారని, ఆవిడవల్లనే తమకు ముప్పు ఉంది కదా? అని మాధురి అన్నారు.

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంపై దివ్వల మాధురి మరోసారి సోషల్ మీడియాలో స్పందించారు. దివ్వల మాధురి అనే మహిళతో సన్నిహింగా ఉంటూ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబాన్ని దూరం పెట్టారని ఆయన భార్య వాణి ఆరోపణలు చేయడంతో వారి ఫ్యామిలీ వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

దివ్వల మాధురి ఇవాళ స్పందిస్తూ తన ఆరోగ్యం బాగోలేకపోవడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోమన్నారని తెలిపారు. అందుకే తాను కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నట్లు వీడియో పోస్ట్ చేశానని చెప్పారు. అయితే, మళ్లీ దువ్వాడ వాణి తనపై కామెంట్లు చేశారని, దీంతో తాను తిరిగి ఇలా ప్రజల ముందుకు వస్తున్నానని తెలిపారు.

తనవల్ల శ్రీనివాస్‌తో పాటు వాణికి ప్రాణహాని ఉందంటూ ఉందంటూ వాణి వ్యాఖ్యలు చేశారని మాధురి చెప్పారు. ఒకవేళ తన వల్ల ప్రాణహాని ఉంటే.. రెండేళ్ల నుంచి దువ్వాడ శ్రీనివాస్ బాగోగులు ఎలా చూసుకుంటానని అడిగారు. రెండేళ్ల నుంచి లేని అపాయము ఇప్పుడు వచ్చిందా అని నిలదీశారు. తాను దువ్వాడ శ్రీనివాస్‌తో ఉంటున్నాననే వాణి నిరసన మొదలు పెట్టింది కదా అని ప్రశ్నించారు.

వాణినే డోర్లు బద్దలు కొట్టారని, ఆవిడవల్లనే తమకు ముప్పు ఉంది కదా? అని మాధురి అన్నారు. ఇంటి నిర్మాణంలో తాను రెండు కోట్ల రూపాయలు పెట్టానని, తాను డబ్బులు ఆశించలేదని చెప్పారు. తనకు ఇల్లు కావాలంటున్న వాణికి ఎంత హక్కు ఉందో.. తనకు కూడా అంతే హక్కు ఉందని తెలిపారు.

తాను పెట్టిన రెండు కోట్ల రూపాయలు తనకు వాణి ఇచ్చేసి ఆ ఇంటిని తీసుకుంటాదా? అని మాధురి అన్నారు. లేదంటే శ్రీనివాస్ కట్టిన రూ.6 కోట్ల సొంత ఇంటికి వెళ్లిపోయి అక్కడికే ఆయనను తీసుకెళ్లి తేల్చుకుంటుందో వారి ఇష్టమని చెప్పారు. దువ్వాడ ఇంటి దగ్గర దర్నాను కొనసాగిస్తే తాను కూడా తన డబ్బుల కోసం అక్కడే నిరసనకు దిగుతానని అన్నారు.

Also Read: మేము చేసిన పనులకు మీరు బ్రాండింగ్ చేసుకోవడం కరెక్ట్ కాదు- గుడివాడ అమర్నాథ్

ట్రెండింగ్ వార్తలు