Election commission : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలిచిపోయిన స్ధానిక సంస్ధల ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు.
విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో అక్టోబర్ 28న ఈ సమావేశం ఉంటుందని ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించాక తదుపరి కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు.