Srikalahasti Temple Fire : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన చొక్కాని ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. చొక్కాని దీపోత్సవంలో మంటలు చెలరేగాయి. అవి భారీగా ఎగిసిపడ్డాయి. భక్తులు భయంతో పరుగులు తీశారు. భారీగా భక్తులు తరలిరావడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ముగ్గురు ఆలయ సిబ్బంది, ఐదుగురు భక్తులు గాయపడ్డారు. ఓ మహిళా సెక్యూరిటీ గార్డుకు చెయ్యి విరిగింది. గాయపడ్డ వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఏటా కార్తీక పౌర్ణమి నాడు శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో చొక్కాని ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా భారీ దీపోత్సవం ఏర్పాటు చేస్తారు. ఈ ఆలయ పరిసరాల్లోనే దాదాపు ఒక 20 అడుగుల ఎత్తులో ఒక దీపాన్ని ఏర్పాటు చేశారు. అయితే, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా దీపోత్సవం నిర్వహించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
ఈ దీపోత్సవానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. చుట్టూ భక్తులు కూర్చుని ఉండగానే.. దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో.. ఆ మంటలు భక్తుల మీద పడ్డాయి. దీంతో భయాకంపితులైన భక్తులు మంటలకు భయపడి ఒక్కసారిగా పరుగు అందుకున్నారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ తొక్కిసలాటలో 8మందికి గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురు ఆలయ సిబ్బంది ఉన్నారు. ఐదుగురు భక్తులు ఉన్నారు. అందరికీ స్పల్పంగా గాయలయ్యాయి. ఆలయ సిబ్బందిలో మహిళా సెక్యూరిటీ గార్డుకి చెయ్యి విరిగింది. ఆమెను వీల్ చైర్ లో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read..Madhya Pradesh: ఆనందంగా డాన్స్ చేశారు.. ఉద్యోగం పోగొట్టుకున్నారు..
నిజానికి.. ఇలాంటి భారీ చొక్కాన్ని దీపోత్సవాన్ని చుట్టూ ఎవరూ భక్తులు లేకుండా, అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ వేడుక నిర్వహించాల్సింది. అయితే, ఆలయ సిబ్బంది కాస్త నిర్లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం, ఊహించిన దానికన్నా అధికంగా భక్తులు రావడం, అదే విధంగా ఎగసిపడ్డ మంటలు.. దీంతో మంటలు చెలరేగి భక్తుల మీద పడ్డాయి. భయాందోళన చెందిన భక్తులు చెల్లాచెదురయ్యారు. పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకోవడం, పలువురికి గాయాలవడం జరిగింది.