Minister Gudivada Amarnath : ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా నియోజకవర్గంగా అమర్ నాథ్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా అమర్ నాథ్ కు నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. గురువారం గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంకు సంబంధించిన ప్రత్యేకంగా మ్యానిఫెస్టోను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాజువాక నియోజకవర్గం ప్రజల అభిప్రాయాలు సేకరించి మ్యానిఫెస్టోను తయారు చేయడం జరిగిందని చెప్పారు. ఉగాది రోజున ఒక వెబ్ సైట్ ప్రారంభించి, అభిప్రాయాలు సేకరణ మొదలు పెట్టామని అమర్ నాథ్ అన్నారు.
Also Read : CM Jagna : ఎన్నికల ప్రచారంలో గేరు మార్చనున్న సీఎం జగన్.. ఇకనుంచి రోజుకు నాలుగు బహిరంగ సభలు!