మాజీ మంత్రి పేర్నినాని కారుపై దాడి..! గుడివాడలో హైటెన్షన్..

ఈ ఘటనలో వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.

Attack On Perni Nani Car : కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మాజీ మంత్రి పేర్నినాని కారుపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులకు పాల్పడ్డారు. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, పేర్నినాని క్షమాపణలు చెప్పాలంటూ జనసైనికులు ఆందోళన చేపట్టారు. గుడివాడలో వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వెళ్లారు పేర్నినాని. శివాజీ ఇంటి ముందు జనసైనికులు ధర్నా చేస్తున్నారు.

మాజీ మంత్రి పేర్నినాని గుడివాడలోని తన బంధువు ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకుని జనసేన, టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, దానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించారు. అక్కడే పార్క్ చేసి ఉన్న పేర్నినాని వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : వైసీపీ ఫైర్‌బ్రాండ్‌ రోజా మనసు మారిందా?

అయితే, పేర్నినాని క్షమాపణలు చెబితే కానీ అక్కడి నుంచి కదిలేది లేదని జనసేన కార్యకర్తలు తేల్చి చెప్పారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. గతంలో పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు