Jethwani Case: హోం మంత్రితో ముంబై నటి జత్వాని భేటీ.. మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడి

హోమంత్రితో భేటీ అనంతరం జత్వాని మీడియాతో మాట్లాడారు. గతంలో పోలీసులు నా విషయంలో ఏ విధంగా వ్యవహరించారో హోంమంత్రికి వివరించానని తెలిపారు. పోలీసులు నా విషయంలో, నా ఫ్యామిలీ విషయంలో

Kadambari Jatwani

Kadambari Jethwani Case : ముంబై నటి కాదంబరి జత్వానీ గురువారం సెక్రటేరియట్ లో ఏపీ హోమంత్రి అనితతో భేటీ అయ్యారు. తనపై అక్రమ కేసులు, వేధింపులపై న్యాయం చేయాలని హోమ్ మంత్రి అనితను నటి జత్వాని, ఆమె తల్లితండ్రులు కోరారు. సీనియర్ సిటిజన్స్ అయిన తన తల్లి, తండ్రి పట్ల విజయవాడ పోలీసులు వ్యవహరించిన తీరును జత్వాని అనితకు వివరించారు. తనపై వేధింపులకు పాల్పడిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పాటు ఐపీఎస్, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని హోమ్ మంత్రి అనితను వారు కోరారు.

Also Read : ముంబై నటి కేసు.. ఆ ముగ్గురు ఐపీఎస్‌లకు చంద్రబాబు ప్రభుత్వం షాక్..!

హోమంత్రితో భేటీ అనంతరం జత్వాని మీడియాతో మాట్లాడారు. గతంలో పోలీసులు నా విషయంలో ఏ విధంగా వ్యవహరించారో హోంమంత్రికి వివరించానని తెలిపారు. పోలీసులు నా విషయంలో, నా ఫ్యామిలీ విషయంలో దారుణంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతంగా ఉంది. న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఏపీ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. నాపై తప్పుడు కేసులు పెట్టిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తరువాతే ఆ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు భవిస్యత్తులో ఇంకెవరికి జరగకూడదు. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని హోమంత్రిని కోరడం జరిగిందని జత్వానీ అన్నారు. నాకు జరిగిన నష్టానికి ఏపీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరుతున్నామని జత్వానీ చెప్పారు.

Also Read : ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం.. ఇద్దరిపై బదిలీ వేటు.. మరో ముగ్గురిపై చర్యలకు రంగం సిద్ధం

జత్వానీ లాయర్ నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జత్వానీ వ్యవహారం వెనుక పెద్దలు ఎవరు ఉన్నారో బయటకు వచ్చిందని చెప్పారు. ముంబైలో ఉన్న కేసును క్లోజ్ చేయించడం కోసమే జత్వానీపై ఏపీలో కేసు పెట్టారు. ఏపీలో జత్వానీపై ఉన్న కేసు క్లోజ్ అయితే.. ముంబై కేసు గురించి ఆ రాష్ట్రంలో పోరాడతామని శ్రీనివాసరావు అన్నారు. జత్వానీ మీద కొందరు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు.. ఇది సరియైన పద్దతి కాదని పేర్కొన్నారు. ఐపీఎస్ లు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని ఎవరూ అనుకోలేదు. జత్వానీ మీద కేసును విత్ డ్రా చేసుకుంటే ఆమె మీద పడిన మచ్చ పోతుంది. చట్టం అందర్నీ సమానంగానే చూడాలి. కుట్రకు మూలం ఎవరు? తెర వెనక పెద్దలు ఎరవనేది విచారణలో తేలుతుంది. జత్వానీ ఫోన్ ను ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. ఫోన్ ఎక్కడ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారోకూడా మెసేజ్ వచ్చింది. జత్వానీని అరెస్టు చేసిన తరువాత ఎవరికైనా చెప్పారా.. కాపీలు ఇచ్చారా? అని శ్రీనివాసరావు ప్రశ్నించారు.