కర్నూలులో దారుణం.. దళిత మహిళను ట్రాక్టర్‌తో ఢీ కొట్టి చంపిన వైనం

మహిళపై దాడి చేస్తుండగా అడ్డువచ్చిన పురుషోత్తమ రెడ్డి అనే వ్యక్తిపై కూడా..

Crime

Kurnool District: కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాతనహల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుండమ్మ అనే దళిత మహిళను ట్రాక్టర్‌తో ఢీ కొట్టి చంపేశారు. రాఘవేంద్ర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అతని అనుచరులు పొలం తగాదా విషయంలో ఆ మహిళను హత్య చేసినట్లు తెలుస్తోంది.

మహిళపై దాడి చేస్తుండగా అడ్డువచ్చిన పురుషోత్తమ రెడ్డి అనే వ్యక్తిపై కూడా నిందితులు దాడి చేశారు. దీంతో పురుషోత్తమ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మహిళపై దాడి జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళ హత్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

ట్రెండింగ్ వార్తలు