Andhra Pradesh : చనిపోయిందనుకున్న తల్లి కళ్లముందు ప్రత్యక్షం.. ఆనందంతో ఉప్పొంగిపోయిన కుమారులు

కొద్ది రోజుల తర్వాత కొత్తగూడెం ప్రాంతంలో ఓ మహిళను దుండగులు పెట్రోల్ పోసి కాల్చి చంపారని తెలుసుకున్నారు. మృతురాలు నాగేంద్రమ్మగా భావించిన భర్త, కుమారులు ఆమెకు కర్మకాండలు కూడా జరిపించారు.

mother

Dead Mother Appear : చనిపోయిందనుకున్న తల్లి కళ్లముందు ప్రత్యక్షం అయింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పుల్లూరు మండలం కొత్తగూడెంకు చెందిన నాగేంద్రమ్మ అనే వృద్ధురాలికి మతి స్థిమితం సరిగ్గా లేదు. రెండేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. దీంతో భర్త తిరుపతయ్యతోపాటు ఇద్దరు కుమారులు అనేక చోట్ల గాలించినా, ఆచూకీ లభించలేదు.

కొద్ది రోజుల తర్వాత కొత్తగూడెం ప్రాంతంలో ఓ మహిళను దుండగులు పెట్రోల్ పోసి కాల్చి చంపారని తెలుసుకున్నారు. మృతురాలు నాగేంద్రమ్మగా భావించిన భర్త, కుమారులు ఆమెకు కర్మకాండలు కూడా జరిపించారు. ఇలావుండగా ఇటీవల కుటుంబ సభ్యులు ఓ యూ ట్యూబ్ చానల్ ద్వారా నాగేంద్రమ్మ ఆచూకీని తెలుసుకున్నారు.

Road Accident : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న నాలుగు వాహనాలు, మూడు వెహికిల్స్ దగ్ధం

ఆమె మధిరలోని ఓ ఆశ్రమంలో ఉన్నట్లు తెలుసుకుని మధిర పోలీసులను ఆశ్రయించారు.శుక్రవారం నాగేంద్రమ్మను కుటుంబ సభ్యులకు అప్పగించారు. చనిపోయిందనుకున్న తల్లి కనిపించడంతో ఇద్దరు కుమారులు ఎంతో ఆనందం పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు