YCP Plenary: ప్రజలకు ఏది మంచో తెలిసిన ఏకైక పార్టీ వైసీపీ
పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎనిమిది కీలక అంశాలకు గురించి చర్చించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏది మంచి జరగాలో తెలిసిన ఏకైక పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు.
- Subhan Ali Shaik
- Published On : July 8, 2022 / 09:23 AM IST
Vijaasai Reddy
YCP Plenary: పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎనిమిది కీలక అంశాలకు గురించి చర్చించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏది మంచి జరగాలో తెలిసిన ఏకైక పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు.
“చంద్రబాబు వేలికి ఉంగరం పెట్టుకున్నానని, అందరి విషయాలు తెలుసని అనుకోవడం చట్ట ప్రకారం నేరం. చిప్ ద్వారా మైండ్కి వెళుతుందంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు చెప్పే మాటలు నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్ళు కాదు” అని విమర్శలకు దిగారు.
ఈ ప్లీనరీ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కొన్ని నియమాలు, నిబంధనల్లో మార్పులు ఉండనున్నాయి. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం మోహన్ రెడ్డిని ఎన్నిక కూడా జరుగుతుంది. విజయమ్మ రెండు రోజులపాటు సమావేశాలకు హాజరవుతారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
