AP Govt
ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ ఎండీగా ఎన్. పి.రామకృష్ణారెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడేళ్ల పాటు ఆయన ఆ బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. ఆంధ్రలో మెట్రో రైల్ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో విశేషమైన అనుభవం ఉన్న రామకృష్ణారెడ్డిని ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీగా నియమిస్తున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ అనుభవం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీగా రామకృష్ణారెడ్డి పని చేశారు. ప్రస్తుత ఎండీ జయ మన్మదరావును రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read: పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి