PRC Protest: కొలిక్కిచేరిన స్టీరింగ్ కమిటీ – మంత్రుల కమిటీ చర్చలు!
కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న నిరసనలు ప్రశాంతం కానున్నట్లు సమాచారం. శనివారం స్టీరింగ్ కమిటీ సభ్యులతో సీఎం జగన్ మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.
- Subhan Ali Shaik
- Published On : February 5, 2022 / 08:53 PM IST
Ap Prc Talks
PRC Protest: కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ సమస్యలపై కొనసాగుతున్న నిరసనలు ప్రశాంతం కానున్నట్లు సమాచారం. శనివారం స్టీరింగ్ కమిటీ సభ్యులతో సీఎం జగన్ మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. దీంతో మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్లుగానే కనిపిస్తున్నాయి.
ఆన్ లైన్ ద్వారా సీఎంతో చర్చలు జరిపిన అనంతరం స్టీరింగ్ కమిటీ, మంత్రుల కమిటీ మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించనున్నాయి.
Read Also: కరోనా మూలాలపై చైనాతో చర్చిస్తున్నామన్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్
