ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధాని కార్యక్రమానికి ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లు చేసింది. పాక్తో ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోదీ అమరావతిలో పర్యటిస్తున్నారు. దీంతో అమరావతి భద్రతా వలయంలో ఉంది.
మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా..
ఉద్యోగులంతా ప్రధాని సభకు హాజరుకావాలి: సీఎస్
వెలగపూడి లోని సచివాలయ ఉద్యోగులంతా ప్రధానమంత్రి సభకు హాజరుకావాలని ఏపీ సీఎస్ విజయానందర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేశారు. అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని హాజరవుతున్న సభకు రావాల్సిందిగా సూచనలు చేశారు.
భద్రతా ఏర్పాట్లు ఇలా..
మోదీ పర్యటనపై మంత్రి నారాయణ మాట్లాడారు. భద్రత రీత్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెలీకాప్టర్ దిగిన వెంటనే క్లోజ్డ్ వెహికల్ లో సభకు వస్తారని తెలిపారు. మోదీ వాహనం వెళ్లే దారికి ఇరువైపులా ప్రజలు నిలబడి స్వాగతం పలకుతారని అన్నారు. పాక్తో యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో ప్రధానికి భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు చెప్పారు. రేపు కూడా వర్షం పడే పరిస్థితులు ఉన్నందున ప్లాన్ బీతోనూ రెడీగా ఉన్నామని తెలిపారు. వర్షం కురిస్తే వాహనాల పార్కింగ్కు ఇబ్బంది కలగకుండా రోడ్లమీద వాహనాలు నిలుపుకునే ప్లాన్ చేశామని అన్నారు.