Polavaram project progress report : వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. కేవలం శంకుస్థాపనల వరకే పరిమితమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరం పనుల్లో వేగం పెరిగింది. ఇప్పుడు వైసీపీ సర్కార్.. 2021 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే.. పోలవరం పనులు ఎక్కడా ఆగడం లేదు.
కరోనా కేసులు పెరుగుతున్నా.. భారీ వర్షాలతో గోదావరిలో వరదలు వచ్చినా.. పోలవరం నిర్మాణ పనులు మాత్రం ఎక్కడా ఆగలేదు. శరవేగంగా మందుకు కదులుతున్నాయి.
పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యామ్కు సంబంధించిన 52 పిల్లర్లు వందశాతం పూర్తయ్యాయి. గోదావరికి వరదలొస్తే పనులు నిలిచిపోకుండా.. అధికారులు ముందుగానే ప్లాన్ చేశారు.
స్పిల్ వేకు ఎగువన, దిగువన.. గోదావరి వరద నీరు నిలిచి ఉన్నా.. పనులు కొనసాగిస్తూనే ఉంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. పోలవరం ప్రాజెక్ట్లో కీలకమైన కుడి కాలువ రెగ్యులేటర్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. రెగ్యులేటర్ నిర్మాణం పూర్తి చేసి గేట్లు కూడా బిగించేశారు.
https://10tv.in/central-government-key-comments-on-polavaram-project/