Chickens : కోళ్లకు పోస్టుమార్టం.. పెంపుడు కోళ్లు మరణించడంపై పోలీసులకు ఫిర్యాదు

ఇంటి వద్ద పెంచుకుంటున్న కోళ్లు మరణించడంతో గ్రామస్తురాలు సుభాషిణి పోలీసులను ఆశ్రయించారు.

chickens

Postmortem of Chickens in Chittoor : చిత్తూరు జిల్లాలో విచిత్రమైన సంఘటన జరిగింది. కోళ్లకు పోస్టుమార్టం నిర్వహించారు. పూతలపట్టు మండలం బత్తిన వారి పల్లిలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. ఇంటి వద్ద పెంచుకుంటున్న కోళ్లు మరణించడంతో గ్రామస్తురాలు సుభాషిణి పోలీసులను ఆశ్రయించారు.

పక్కింటి వాళ్ళు పంటలకు వేసే ఎరువులు తినడం వల్లే తన కోళ్లు మరణించాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Chandrababu : చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

కోళ్ళ మరణానికి కారణాల నిర్ధారణ కోసం వాటికి వెటర్నరీ డాక్టర్ల ద్వారా పోస్ట్ మార్టం నిర్వహించారు. ల్యాబ్ రిపోర్టులు అందిన తరువాత చర్యలు చేపడతామని పోలీసులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు