CM Jagan Offer For Farmers : ఏపీ సీఎం జగన్ రాయలసీమ రైతులకు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. సోలార్, విండ్ పవర్ సంస్థల కోసం భూములిచ్చే రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 30 వేల చొప్పున లీజు ధర చెల్లిస్తామన్నారు. ఈ మేరకు రైతులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వమే రైతుల నుంచి భూములను లీజుకు తీసుకుని సౌర, పవన విద్యుత్ తయారీ సంస్థలకు ఇస్తుందని చెప్పారు.
ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం మేర లీజు ధరను పెంచుతామని జగన్ తెలిపారు. ఈ ప్రాజెక్టులు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు సీఎం జగన్. గ్రీన్కో ప్రాజెక్టులకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లాలో రామ్ కో సిమెంట్స్ పరిశ్రమను ప్రారంభించిన సందర్భంగా జగన్ ఈ ఆఫర్ గురించి తెలిపారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
ఒక్కో లొకేషన్ లో కనీసం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేలా భూసేకరణ జరగాలని జగన్ చెప్పారు. ఆ మేరకు రైతులు భూములు ఇచ్చేలా వారిని ఒప్పించేలా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. ఈ గ్రీన్ గో ప్రాజెక్టుల నిర్మాణాలకు రైతులు కూడా సహకరించాలని కోరారు.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద రామ్కో సిమెంట్స్ పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ లీజు అంశాన్ని ప్రస్తావించారు.