ప్రియుడి మోజులో కిరాతకం…..మేకులు కొట్టిన కర్రతో కన్నబిడ్డలను చావబాదిన తల్లి

  • Publish Date - October 28, 2020 / 01:11 PM IST

Son Brutally Beaten by Mother,  she Involved in live-in relationship, in Guntur district : వివాహేతర సంబంధం మోజులో కన్నతల్లి కిరాతకంగా ప్రవర్తించింది.ప్రియుడితో ఏకాంతంగా గడపటానికి అడ్డుగా ఉన్నాడని కన్న బిడ్డలను  దారుణంగా హింసించింది. మేకులు కొట్టిన కర్రతో కొట్టి ఇంటి నుంచి గెంటేసింది.

గుంటూరు జిల్లా బాపట్ల కు చెందిన వివాహిత భర్తను వదిలేసి… తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీను అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమె తన ప్రియుడితో ఏకాంతంగా గడిపే సమయంలో  కొడుకు,కూతురు అడ్డుగా ఉన్నారని భావించింది.



దీంతో ఇటీవల ప్రియుడితో సన్నిహితంగా ఉండేందుకు పిల్లలుఅడ్డుగా ఉన్నారని ..ఒక కర్రకు మేకులు కొట్టి…ఆ కర్రతో  పిల్లల వీపుపై విచక్షణా రహితంగా కొట్టి ఇంటి నుంచి బయటకు వెళ్ల గొట్టింది. ఇది గమనించిన స్ధానికులు గ్రామ మహిళా పోలీసు జ్యోతికి విషయం తెలియచేశారు. ఆమె వెంటనే ఇంటివద్దకు చేరుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న తల్లిని పట్టుకుని పోలీసు స్టేషన్ లో అప్పగించింది.



ట్రెండింగ్ వార్తలు