ఏ తప్పు చేయలేదు..అంతా కుట్ర – SVBC ఛైర్మన్ పృథ్వీ

  • Publish Date - January 12, 2020 / 11:44 AM IST

నేను ఏ తప్పు చేయలేదు..అంతా కుట్ర చేశారంటున్నారు కమెడియన్, ఎస్వీబీసీ ఛైర్మన్ ఫృథ్వీ. రాజకీయాలు చేసి తనపై కక్ష తీర్చుకుంటున్నారని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై 2020, జనవరి 12వ తేదీ ఆదివారం సాయంత్రం ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ప్రజల ముందు తల దించే పరిస్థితులు వస్తాయని తాను ఎప్పుడు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, రాజధాని రైతుల విషయంలో తాను అనని మాటలను అన్నట్లు వక్రీకరించి కొందరు మాట్లాడుతున్నారని చెప్పారు. ఇక మరో నటుడు పోసాని కృష్ణ మురళికి తనకు ఎలాంటి విబేధాలు లేవన్నారు. SVBCలో ఏ ఒక్కరిని అడిగినా తన గురించి చెబుతారని, ఘటనపై నియమించబడిన విజిలెన్స్ ఎంక్వయిరీలో వాస్తవాలు బయటకొస్తాయన్నారు.
 

పద్మావతి గెస్ట్ హౌస్‌లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డానని అనడం అవాస్తవమని కొట్టిపారేశారాయన. గతంలో అన్యమత ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. తనకు ఈ విషయం తెలిసిన తర్వాత..కన్నీళ్ల పర్యంతమయ్యాయనని, వెంకన్నకు సేవలు చేసేందుకు SVBCకి వచ్చానన్నారు. 

 

ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే రాజధాని రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆయన అసభ్యంగా మాట్లాడారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పృథ్వీ రాసలీలకు సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

Read More : అల వైకుంఠపురములో రివ్యూ

ట్రెండింగ్ వార్తలు