TDP Leaders Tension : టీడీపీ-జనసేన పొత్తు.. టెన్షన్ పడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కారణం ఏంటంటే..

కొన్ని చోట్ల జనసేనకు నాయకత్వ సమస్య ఉన్నా కేడర్ బలం ఎక్కువగా ఉండటంతో టీడీపీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. TDP Leaders Tension

TDP Leaders Tension

TDP Leaders Tension With Janasena : ఏపీ రాజకీయాల్లో కీలక నియోజకవర్గాలు ఉభయగోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో 20శాతం ఓటర్లు ఉన్న గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ గెలిస్తే అధికారం ఆ పార్టీకే సొంతం అనే టాక్ ఉంది. అందుకే, ప్రధాన పార్టీలు ఉభయగోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంటారు. గత ఎన్నికల్లో గోదావరి తీరంలో వైసీపీ హవాలో కొట్టుకుపోయాయి టీడీపీ, జనసేన పార్టీలు. ఇప్పుడు ఈ రెండు కూటమిగా ఏర్పడటం, పొత్తు పెట్టుకుని కలిసే పోటీ చేస్తామనడంతో ఆసక్తికరంగా మారింది. కొన్ని చోట్ల ఇరు పార్టీలు బలంగా ఉండటంతో సీట్లపై పోటాపోటీ కనిపిస్తోంది. ఈ పోటీని అనుకూలంగా తీసుకుని మళ్లీ జెండా ఎగురవేయాలని చూస్తోంది వైసీపీ.

ఇటు టీడీపీ అటు జనసేనలోనూ గుబులు..
గోదావరి తీరంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార వైసీపీ ఓవైపు.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ-జనసేన పొత్తు గోదావరి జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. అందుకు ముఖ్య కారణం జనసేనాని పవన్ సొంత సామాజికవర్గం ఈ జిల్లాల్లో ఎక్కువగా ఉండటం. పవన్ కూడా ఈ జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్.. ఈసారి గోదావరి జిల్లాల్లో కాకినాడ రూరల్, పిఠాపురం, భీమవరం ఇలా మూడు నాలుగు నియోజకవర్గాలో ఎక్కడో ఓ చోట నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇటు టీడీపీ అటు జనసేనలోనూ గుబులు రేగుతోంది.(TDP Leaders Tension)

Also Read..TDP: తెలుగుదేశానికి జీవన్మరణ సమస్య.. క్లిష్ట పరిస్థితులను టీడీపీ ఎలా ఎదుర్కొబోతోంది.. బాలకృష్ణ వల్ల అవుతుందా?

ఎవరి సీటుకు ఎసరు వస్తుందోననే ఆందోళన..
గోదావరి జిల్లాలలో కాకినాడ రూరల్, కొత్తపేట, పిఠాపురం, భీమవరం, రాజోలు, అమలాపురం, రామచంద్రాపురం, రాజానగరం, రాజమండ్రి రూరల్ వంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది. కొన్ని చోట్ల నాయకత్వ సమస్య ఉన్నా కేడర్ బలం ఎక్కువగా ఉండటంతో టీడీపీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందో అని భయపడుతున్నారు టీడీపీ నేతలు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోని ఒక్కో పార్లమెంటు పరిధిలో రెండు సీట్లు జనసేనకు కేటాయించాలనే ప్రతిపాదనతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందోననే ఆందోళన కనిపిస్తోంది.(TDP)

ఏలూరులో టీడీపీ కేడర్ బలంగా ఉంది. అక్కడ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినా జనసేన చీల్చిన ఓట్లే కీలకంగా మారాయి. ఇప్పుడు పొత్తులో భాగంగా ఆ సీటును జనసేన కోరుకుంటోంది. దీంతో టీడీపీ నేతలను ఆకర్షించే పనిలో పడింది వైసీపీ. పొత్తులో భాగంగా ఏలూరు సీటు జనసేనకు కేటాయిస్తే టీడీపీ నేతలు పార్టీ మారే అవకాశాలపై విస్తృత ప్రచారం జరుగుతోంది.

Also Read..Chandrababu: అచ్చెన్నాయుడి ప్రకటన.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారా.. బాబు స్కెచ్ ఏంటో?

ప్రతీ చోటా పొత్తు పంచాయితీ..
ఇలా ఒక్క ఏలూరు నియోజకవర్గమే కాకుండా పొత్తు పంచాయితీ ఉన్న ప్రతీ చోట ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికార వైసీపీ కూడా టీడీపీ-జనసేన పొత్తులపై అంత ధీమాగా ఉండటానికి అదే కారణం అంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎటువైపు ఉంటారో ఊహించడం కష్టం. అందుకే టీడీపీ-జనసేన రాజకీయాలను ఓ కంట కనిపెడుతోంది వైసీపీ. అదును చూసి దెబ్బతీయడానికి వైసీపీ హైకమాండ్ సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది.(TDP)

ఈ పరిస్థితుల్లో గోదావరి జిల్లాలలో పరిస్థితులను టీడీపీ-జనసేన నేతలు ఎలా సమన్వయం చేసుకుంటారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు పార్టీలు సమన్వయ కమిటీలు వేసుకుని పొత్తులపై చర్చలకు సిద్ధమవుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు.(TDP)

ట్రెండింగ్ వార్తలు