నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్న బాధ అందుకే పోయింది: బుద్ధా వెంకన్న

తాము నానికి వ్యతిరేకులమని, అంతేగానీ పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకం కాదని తెలిపారు.

టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని చిన్నికి విజయవాడలో అభినందన సభ నిర్వహించారు. బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. కేశినేని నాని ఎంపీ నామినేషన్ విత్ డ్రా అయ్యాక చంద్రబాబు నాయుడికి వ్యతిరేకిగా మాట్లాడారని చెప్పారు. తాము నానికి వ్యతిరేకులమని, అంతేగానీ పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకం కాదని తెలిపారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్న బాధ చంద్రబాబు సీఎం అయ్యాక పోయిందని తెలిపారు.

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. తనకు అందరి సహకారంతో ఎంపీ పదవి వచ్చిందని తెలిపారు. బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తనకు, బుద్ధా వెంకన్నకు ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, పట్టాభికు పదవులు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు.

ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ.. కేశినేని చిన్ని చేసిన సేవా కార్యక్రమాలు అందరికీ తెలుసని చెప్పారు. గతంలో ఎంపీగా కొనసాగిన కేశినేని నాని ఎన్నడూ ఏ కార్యకర్తకీ ఉపయోగపడలేదని అన్నారు. ఆయన కార్యకర్తలను పట్టించుకోలేదు కాబట్టే ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకున్నారని చెప్పారు.

Also Read: వారిని వదిలేది లేదు.. ప్రతిఒక్కరిపై క్రిమినల్ కేసులు పెడతాం : మంత్రి నాదెండ్ల మనోహర్

ట్రెండింగ్ వార్తలు