Putta Sudhakar Yadav: రాచమల్లు చిల్లర రాజకీయాలు మానుకో.. మద్యం తాపించి కోడిగుడ్డు వేయించిన నీచమైన వ్యక్తివి నవ్వు ..

ప్రొద్దుటూరులో ఓటు హక్కు కలిగిన వ్యక్తి మైదుకూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయిన నాకు ఎలా అభిమాని అవుతాడని పుట్టా సుధాకర్ యాదవ్ ప్రశ్నించారు.

TDP Leader Putta : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి‌ (Rachamallu Siva Prasad Reddy) పై టీడీపీ మైదుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ (Putta Sudhakar Yadav) మండిపడ్డారు. యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) ప్రొద్దుటూరు (Proddutur) లో జరుగుతున్న క్రమంలో నారా లోకేశ్ (Nara Lokesh) పై ఓ వ్యక్తి కోడిగుడ్డు విసరడం కలకలం రేపింది. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై సుధాకర్ మాట్లాడుతూ.. నారా లోకేశ్ పై కోడిగుడ్డు విసిరిన యువకుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడు అని ఆధారాలతో సహా బయట పెట్టారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఉన్నదిలేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడం మానుకోవాలని సుధాకర్ యాదవ్ హితవు పలికారు.

Nara Lokesh : పాదయాత్రలో నారా లోకేశ్‌పై దాడి.. ప్రొద్దుటూరులో ఉద్రిక్తత

లోకేశ్‌పై కోడిగుడ్డు వేసిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని, అంతేకాక, రాచమల్లు అభిమాని అని అన్నారు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి నివాసానికి సమీపంలోనే ఆ యువకుడు నివాసం ఉంటున్నాడని అన్నారు. ఆ యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేవాడని సుధాకర్ యాదవ్ చెప్పారు. ఆ యువకుడి సోషల్ మీడియా అకౌంటు ఓపెన్ చేస్తే అతను ఎవరి అభిమాని అన్నది వాస్తవం తెలుస్తుందని చెప్పారు. రాచమల్లు అరాచకాలు, అవినీతి కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైన రాచమల్లు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని పుట్టా సుధాకర్ యాదవ్ హెచ్చరించారు.

Perni Nani: టీడీపీ నేత నారా లోకేశ్‌ను కోడిగుడ్లతో కొట్టింది వీరే.. : పేర్ని నాని

ప్రొద్దుటూరులో ఓటు హక్కు కలిగిన వ్యక్తి మైదుకూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయిన నాకు ఎలా అభిమాని అవుతాడని పుట్టా సుధాకర్ యాదవ్ ప్రశ్నించారు. యువకుడికి మందు తాపించి లోకేశ్ పై కోడిగుడ్డు వేయించిన నీచమైన వ్యక్తి రాచమల్లు అంటూ ఘాటుగా విమర్శించారు. ఆ యువకుడు స్వచ్ఛందంగా తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానిని అని టీడీపీ అభిమానిని కాదు టీడీపీకి సంబంధం లేదని తెలియజేయడం జరిగిందని గుర్తు చేశారు. మా నాయకుడు నారా లోకేశ్ వస్తే స్థలం లేకుండా ఫ్లెక్సీలు కట్టావు. అది దౌర్జన్యం కాదా? తొందరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారంటూ ఎమ్మెల్యే రాచమల్లును టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు