ఏపీలో ‘తల్లికి వందనం’ విధివిధానాలు ఖరారు.. ఆధార్ కార్డుతో..

ఈ పథకం ద్వారా 15 వేల రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు కిట్స్ పంపిణీకి..

Thalliki Vandanam Scheme 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం కార్యక్రమం కోసం విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం ద్వారా 15 వేల రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు కిట్స్ పంపిణీకి ఉత్తర్వులు విడుదలయ్యాయి.

ఈ పథక లబ్ధిదారుల గుర్తింపునకు ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వ గుర్తింపుతో ఉన్న ఇతర కార్డులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద రూ.15 వేలతో పాటు విద్యార్థులకు బ్యాగు, బూట్లు, బెల్టు, సాక్సులు, పుస్తకాలు, యూనిఫాం ఇస్తారు.

లబ్ధిదారులు ఐడెంటిటీగా కింది వాటిలో ఏదైనా ఒకదాన్ని వాడొచ్చు

  • ఆధార్ కార్డు
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఫొటో ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్ బుక్
  • పాన్ కార్డు
  • రేషన్ కార్డు
  • ఓటర్ ఐడెంటిటీ కార్డు
  • ఎంజీఎన్ఆర్ఈజీఏ కార్డు
  • ఫొటో ఉన్న కిసాన్ కార్డు
  • గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ అఫిషియల్ లెటర్ హెడ్
  • ఏదైనా డిపార్ట్మెంట్ డాక్యుమెంట్

Also Read: బీజేపీలో చేరేందుకు భయపడిపోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..! ఎందుకో తెలుసా..

ట్రెండింగ్ వార్తలు