తల్లిదండ్రులను నరికిన కసాయి కొడుకు..తల్లి మృతి, తండ్రి పరిస్థితి విషమం

The son who attacked the parents..the mother died : కృష్ణా జిల్లాలో ఓ కసాయి కన్న తల్లిదండ్రులపైనే దాడికి పాల్పడ్డాడు. తల్లి, తండ్రిని దారుణంగా నరికాడు. ఈ దాడిలో తల్లి మరణించగా…. తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన నాగాయలంక మండలం ఎదురుమొండిలో చోటు చేసుకుంది.

ఎదురుమొండి గ్రామానికి చెందిన వీర్లంకమ్మ, నాగేశ్వరావు కుమారుడు వీర రాఘవయ్యకు కొన్నేళ్ల క్రితం పెళ్లి చేశారు. వీర రాఘవయ్య, అతడి భార్య మధ్య కొన్నాళ్లుగా కలహాలు మొదలయ్యాయి. ఈ కలహాలకు తన తల్లిదండ్రులే కారణమని భావించిన రాఘవయ్య… రాత్రి పడుకున్న తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఇద్దరి తలపైనా నరికాడు.

ఈ దాడిలో తల్లి వీర్లంకమ్మ అక్కడికక్కడే చనిపోయింది. తీవ్ర గాయాలపాలైన తండ్రి నాగేశ్వరావును చికిత్స కోసం అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇక వీర రాఘవయ్య… పరారయ్యాడని.. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు